ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విభజన హామీలను ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలకు చప్పట్లు కొడుతూ.. మౌనంగా ఉండిపోతున్నారని ఆరోపించారు. విభజన జరిగి 11 ఏళ్లు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలలో పది శాతం కూడా కేంద్రం అమలు చేయలేదని.. మన ఎంపీలకు ఈ విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. మీలో ప్రవహించేది తెలుగోడి రక్తమే అయితే కేంద్రాన్ని నిలదీయాలని షర్మిల డిమాండ్ చేశారు.