ఏపీలో దివ్యాంగుల పింఛన్ల తొలగింపు వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. అనర్హుల ఏరివేత మంచిదే ఆయినప్పటికీ.. అర్హులైన వారిని కూడా తొలగించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని వైఎస్ షర్మిల ఆరోపించారు. సుమారుగా 20 ఏళ్ల నుంచి పింఛన్ పొందుతున్న వారి పొట్టకొట్టడం సముచితం కాదని మండిపడ్డారు. నోటీసులు జారీ చేసిన వారికి రీవెరిఫికేషన్ చేసి.. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.