ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెకి చెందిన వెంకట రమణారెడ్డి అనే వ్యక్తి సుమారు 18 ఏళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ 18 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడో తిరిగాడు. అయితే ఎట్టకేలకు జ్వరం అతన్ని కుటుంబంతో కలిసేలా చేసింది. తమిళనాడు కోయంబత్తూరులో జ్వరంతో చేరగా.. తెలిసిన వ్యాపారి వివరాలు కనుక్కుని ఒంటిమిట్టలోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో 18 ఏళ్ల తరువాత రమణారెడ్డి సొంతింటికి చేరారు.