మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తి మొత్తం అమరావతికి రాసిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వేయికోట్లు ఆస్తి కూడబెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై సిట్టింగ్ జడ్డితో విచారణకు సిద్ధమని.. నిజమని తేలితే ఆ ఆస్తి మొత్తం అమరావతికి రాసిస్తానంటూ అనిల్ కుమార్ యాదవ్ ఛాలెంజ్ చేశారు.