ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఐపీఎల్ గురించే చర్చ. చిన్నా,పెద్దా వయసుతో సంబంధం లేకుండా క్రికెట్ అంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ మీటింగ్లోనూ క్రికెట్ గురించి ప్రస్తావన వచ్చింది. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ సందర్భంగా క్రికెట్, పాలిటిక్స్ మిక్స్ చేసి.. పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అందరూ ధోనీలాగా మారాలంటూ పిలుపునిచ్చారు.