సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్.. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రజల తరుఫున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎల్లప్పుడూ అధికారంలో ఉండరన్న వైఎస్ జగన్.. మరో నాలుగేళ్ల తర్వాత చేసిన ప్రతి పనికి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.