సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎన్నెన్నో మాటలు చెప్పిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తామన్నారని.. కానీ ఒక్క దీపమైనా వెలిగించారా అంటు ప్రభుత్వ పథకాల అమలను ప్రశ్నించారు. ఏదో చేశామంటే చేశామన్నట్లుగా అరకొర దీపాలు వెలిగించారని.. అలాగే వైసీపీ హయాంలో అందించిన 30 పథకాలు అనే దీపాలను కూడా పూర్తిగా ఆర్పివేశారంటూ వైఎస్ జగన్ విమర్శించారు.