వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్లో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్లో ఉన్నారని.. అందుకే ఏపీపైనా, చంద్రబాబుపైనా కాంగ్రెస్ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు అని.. ఇప్పుడైనా మార్పు తెచ్చుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.