వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలన్న ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. నవంబర్ 14వ తేదీలోగా వైఎస్ జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలంటే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని.. అది యంత్రాంగానికి భారమని జగన్ మెమో దాఖలు చేశారు. ప్రత్యామ్నాయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు ఇబ్బంది లేదని మెమో దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదీ ఆసక్తికరంగా మారింది.