ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఎన్నారైల 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి లక్ష్మీ పార్వతి.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వంలో విధ్వంసం తప్ప ఏమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్సార్, జగన్ ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవాసులకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.