మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాకాణి గోవర్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రుస్తుం మైనింగ్ కేసులో కాకాణికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ 8 కేసులలో ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆగస్ట్ 18న జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.