వైసీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బొత్స సత్యనారాయణపై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. అమరావతిని శ్మశానం అన్న మాటపై వెలగపూడి రైతు బొత్స సత్యనారాయణపై ఫిర్యాదు చేశారు. అమరావతి బహుజన ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడితో కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు సోమవారం కూడా ఏపీ శాసనమండలిలో ఇదే అంశం అధికార విపక్షాల మధ్య మాటలయుద్ధానికి కారణమైన సంగతి తెలిసిందే.