మాజీ మంత్రి రోజా టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూడు కోతుల కథను ప్రస్తావిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తీరును ఎండగట్టారు. ప్రకాశం జిల్లాలో జరిగిన రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొన్న రోజా.. హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు చంద్రబాబు మోకాలడ్డుతున్నారని రోజా ఆరోపించారు.