వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. వైఎస్ జగన్ విశాఖపట్నం నుంచి మాకవరపాలెం రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హెలికాప్టర్లో వెళ్లేందుకు అనుమతించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి మాకవరపాలెం వరకూ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు వైసీపీ అనుమతి కోరింది. అయితే రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమన్న అనకాపల్లి జిల్లా ఎస్పీ.. హెలికాప్టర్లో వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమిళనాడులో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనను ఎస్పీ ప్రస్తావించారు.