మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయిలో ప్రమాదం చోటుచేసుకుంది. వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పెనమలూరు నియోజకవర్గంలో మొంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు జగన్ కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు. ఈ క్రమంలోనే ఉయ్యూరు మండలంలోని గండిగుంట వద్ద వైఎస్ జగన్ కాన్వాయిలోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డ్డారు.