టీడీపీ కూటమి పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను విస్మరించారని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ క్రమంలోనే 'రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో' పేరుతో 5 వారాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా మ్యానిఫెస్టోను ప్రజలకు తెలియజేయనున్నారు. ఐదు వారాల పాటు వివిధ దశల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని వైసీపీ విస్తృత స్థాయిసమావేశంలో జగన్ పిలుపునిచ్చారు.