ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. సీఎం చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకాణిపై కేసులు నమోదు కాగా.. పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాకాణి ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు.