Ysrcp Loosed S Rayavaram Mpp: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో ఎంపీపీ స్థానాన్ని కోల్పోయింది. టీడీపీ మద్దతుతో కేసుబోయిన వెంకటలక్ష్మి ఎంపీపీగా ఎన్నికయ్యారు. మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో కడలి శ్రీదుర్గ ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికలకు గైర్హాజరయ్యారు. ఇటీవల రాష్ట్రంలో వైఎస్సార్సీపీ వరుసగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పదవుల్ని.. జెడ్పీ, ఎంపీపీ పదవులు కోల్పోయిన విషయం తెలిసిందే.