Another Case on YS Jagan over Guntur mirchi yard visit: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద మరో కేసు నమోదైంది. సింగయ్య మృతి అంశంలో ఇప్పటికే జగన్ మీద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అనుమతి లేకుండా వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.