ఏపీలోని నెల్లూరు జిల్లాలో జికా వైరస్ వార్తలు కలకలం రేపుతున్నాయి. ఓ ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. బాలుడిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించినట్లు చెప్పారు, బాలుడి నుంచి నమూనాలు సేకరించి పుణె ల్యాబ్కు పంపించామని చెప్పారు. మర్రిపాడు మండలంలోని బాలుడి గ్రామంలోనూ వైద్య పరీక్షలు చేస్తున్నామని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుందని.. భయపడాల్సిన పనిలేదని మంత్రి చెప్పారు.