తెలంగాణలో అంగన్వాడీ పిల్లల కోసం త్వరలో అల్పాహారం పథకం ప్రారంభిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యం, హాజరు శాతం పెరుగుతాయని ఆమె తెలిపారు. హైదరాబాద్లోని 139 కేంద్రాల్లో అమలు చేయగా.. హాజరు 30 శాతం పెరిగిందని ఆమె చెప్పారు. అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల మాదిరిగానే ఉచితంగా ఇసుక ఇస్తామని, స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ హెల్పర్లకు, టీచర్లకు యూనిఫాంలు పంపిణీ చేయాలని కూడా ఆమె సూచించారు.