తెలంగాణ ప్రభుత్వం మూడు నుంచి ఐదేళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన పోషక విలువలున్న పాలను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం ఏటా రూ. 50 కోట్లు ఖర్చు చేయనుంది. ముందుగా ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి, విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.