డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులకు షాక్ అయ్యే సంఘటన ఎదురైంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులను పట్టుకునే క్రమంలో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతడిని టెస్ట్ చేయగా మెషీన్లో ఏకంగా 550 పాయింట్లు చూపించింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో అతడికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు ఇచ్చింది.