ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీకి మరింత ఇమేజ్ తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాఫీ ఘుమఘుమలను అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే కాకుండా.. ఆదివాసీల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించే దిశగా పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఎంఓయూలు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో శనివారం ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. గిరిజన , అటవీ ఉత్పత్తుల విక్రయానికి ఈ అవగాహన ఒప్పందాలు సహకరిస్తాయి.