కరీంనగర్లో జనవరి 24న పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల, స్థానిక నేతలు కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రారంభోత్సవాల సమయంలో.. ఆ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అందరి ముందే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈరోజు (జనవరి 25) పమేలా సత్పతి తన ఇన్స్టాలో ఎమోషనల్ స్టేటస్ పెట్టటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.