తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కొందరు టీటీడీ నిర్దేశించిన విదానంలో కాకుండా.. దళారులను నమ్ముకుని మోసపోవడం తరుచూ జరుగుతోంది. టీటీడీ వెబ్సైట్ను పోలిన నకిలీ సైట్లతో కేటుగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. కొందరు తిరుమలలోని దేవస్థానం ఆఫీసులు, ఎంక్వైరీ కేంద్రాల వద్ద భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలు పేరుతో మోసగించి.. డబ్బులు వసూలు చేస్తున్న సంగతి తెలిసింది. దీనిపై టీటీడీ చర్యలు చేపట్టింది.