ఇప్పటి వరకు డబ్బులు వచ్చే ఏటీఎం చూసి ఉంటారు. ఇటీవల కాలంలో బంగారం కొనుగోలు చేసే ఏటీఎంలు కూడా వచ్చాయి. తాజాగా.. గోల్డ్లోన్ ఇచ్చే ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చింది. వరంగలో నగరంలో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ గోల్డ్లోన్ ఏటీఎంను ఏర్పాటు చేసింది. దీని ద్వారా చాలా ఈజీగా నిమిషాల వ్యవధిలోనే లోన్ తీసుకోవచ్చు.