పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతపై తేల్చే అధికారం డివిజన్ బెంచ్కే ఉందని స్పష్టం చేసింది. దేవాలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో న్యాయస్థానాలే మొదటి సంరక్షకులు అని హైకోర్టు వ్యాఖ్యానించింది.