తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రచయిత, ప్రజాకవి అందెశ్రీ హార్ట్స్ట్రోక్తో కన్నుమూసినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. ఆయన గత 15 ఏళ్లుగా అధిక రక్తపోటుతో బాధపడుతుండగా.. ఇటీవల మందులు వాడకపోవడం, అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే మరణానికి కారణమని వైద్యులు తెలిపారు. ఆయన మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు.