మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేసినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. చికిత్స తర్వాత అంబటి రాంబాబును వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయం తెలిసి వైసీపీ శ్రేణులు, అంబటి రాంబాబు అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.