3 ఏళ్ల చిన్నారిని వంతెనపై వదిలేసి.. ఓ యువజంట గోదావరి నదిలోకి దూకిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు బంగారు ఉంగరం విషయంలో ఎదురైన ఒత్తిళ్లు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ ఆడియో మెసేజ్ పంపించినట్లు గుర్తించారు. బ్రిడ్జిపై ఒంటరిగా ఏడుస్తున్న చిన్నారిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.