మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు ఊరట కలిగించింది. జైళ్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ అంబటి రాంబాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు.. అంబటి రాంబాబుకు రూల్స్ ప్రకారం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించింది. అంబటి రాంబాబును ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించాలని జైలు అధికారులకు సూచించింది. మరోవైపు అంబటి బెయిల్ పిటిషన్ మీద కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.