మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు మీద హత్యాయత్నం జరిగిందంటూ వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ గూండాలు ఈ దాడి చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్న జగన్.. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.