హైదరాబాద్ నగరంలోని రహదారులకు అడ్డుగా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని HYDRA కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. రహదారులు, ఫుట్పాత్లను ఆక్రమిస్తున్నారని, ప్రజా స్థలాలను కాజేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆదేశాలు కాదని నిర్మిస్తే ఉపేక్షించేది లేదని కూల్చేస్తామని స్పష్టం చేశారు.