అక్కడ స్పేస్ లేదు.. అయినా క్రియేట్ చేసుకున్నాడు.. కళ్లు మూసి తెరిచేలోపు పనికానిచ్చేశాడు..

5 months ago 18
టిఫిన్ చేసే సమయంలో బైక్‌లో దాచిన రెండు లక్షలు కాజేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చోటు చేసుకుంది. నరసాపురానికి చెందిన ఉంగరాల శ్రీను అనే వ్యక్తి బ్యాంకులో రెండు లక్షలు డ్రా చేసి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఆకలేయటంతో హోటల్ వద్ద బైక్ ఆపాడు. టిఫిన్ చేసి వచ్చేసరికి బైక్‌ కవర్లో ఉంచిన రెండు లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇక హోటల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో ఓ యువకుడు ఈ డబ్బులు కాజేసినట్లు గుర్తించారు.
Read Entire Article