అక్రమ మైనింగ్, మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సంస్థకు చెందిన రూ. 80.05 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. క్వారీ పరిమితికి మించి తవ్వకాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్తో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది.