తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మాడు పగిలే ఎండలతో ప్రజలకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భీకరమైన ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేడు కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.