తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఓ మహిళను మోసం చేసిన కేసులో మోకిల పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత న్యాయమూర్తి ముందు హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అఘోరని ఏ జైలుకు తరలించాలో తెలియక పోలీసులు కన్ఫ్యూజన్కు గురయ్యారు. లింగ నిర్ధారణ సమస్యతో కంది జైలు అధికారులు తిరస్కరించగా.. చివరకు చంచల్గూడ జైలుకు తరలించారు.