మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నామినేషన్ను బీజేపీ, ఎన్నికల సంఘం లాలూచీపడి తిరస్కరించాయని, తన సీటును దొంగిలించారని ఆమె ఆరోపించారు. తనపై ఎలాంటి లీగల్ కేసులు లేవని.. అఫిడవిట్ సాకుతో కుట్ర పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. తాను మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తినని.. కాబట్టి అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తానన్నారు. తెలంగాణ నుంచి ఎవరితోనూ రాజీనామా చేయించి సీటు తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.