టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు మేరకు శ్రీచరణ్ మీద ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే ఆమె మరణంపై కుటుంబసభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇక ఫిర్యాదు సందర్భంగా అల్లుడు శ్రీచరణ్ మీద సుధాకర్ 11 అనుమానాలు వ్యక్తం చేశారు. వీటిపై దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.