అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే.. బీజేపీకి వచ్చిన నష్టమేంటి: రేవంత్ రెడ్డి

4 months ago 9
జూబ్లీహిల్స్‌ బైపోల్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా షేక్‌పేట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం.. హైదరాబాద్‌లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఎందుకు కట్టకూడదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని కిషన్‌రెడ్డి అడుగుతున్నారని.. ఎందుకు ఇవ్వొద్దో ఆయన చెప్పాలని నిలదీశారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే బీజేపీకి, కిషన్‌రెడ్డికి ఏం ఇబ్బందని అడిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం కేసీఆర్‌ ఒక్కటేనని.. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని మండిపడ్డారు.
Read Entire Article