తెలంగాణ మంత్రి అజారుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠ వీడటం లేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన విచారణను వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ప్రభుత్వం సిఫార్సులపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలని అటార్నీ జనరల్ విజ్ఞప్తి చేయడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.