తెలంగాణలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ల అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తూ లోక్భవన్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30తో మంత్రి అజారుద్దీన్ ఆరు నెలల గడువు ముగియనున్న తరుణంలో.. ఈ నియామకం ఆయన పదవిని కాపాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ను కలిసి చేసిన విజ్ఞప్తి ఈ ప్రతిష్టంభనను తొలగించడంలో కీలక పాత్ర పోషించింది.