అటవీ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్.. ఏ1గా జనసేన నేత..!

6 months ago 9
అటవీశాఖ ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై శ్రీశైలం పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసు నమోదుచేశారు. అయితే ఈ కేసులో ఏ-1గా శ్రీశైలం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ రౌతు అశోక్‌ను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈయనే ప్రధాన నిందితుడని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఏ-2గా చూపారు. రౌతు అశోక్‌ జనసేన నాయకుడైనా.. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటారని అంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఎమ్మెల్యేతోపాటు ఆయనా ఉన్నారని.. ఉద్యోగులపై దాడిచేశారని బాధితులు పోలీసులకు వివరించారు. దీంతో గురువారం అశోక్‌ను కూడా పిలిపించి పోలీసులు విచారణ చేశారు.
Read Entire Article