అడవిలో ఆ నలుగురు.. ఎంజాయ్ చేద్దామని వెళ్తే.. వామ్మో!

4 hours ago 1
విజయవాడకు చెందిన నలుగురు స్నేహితులు. వీకెండ్ కావటంతో సరదాగా అలా గడుపుదామని అనుకున్నారు. చక్కగా ప్లాన్ చేసుకున్నారు. కొండపల్లి కోటకు విహారానికి వెళ్దామని బయల్దేరారు. అక్కడకు చేరుకున్న తర్వాత ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సమయాన్ని మరిచిపోయారు. చీకటి పడింది. తిరిగి ఇళ్లకు బయల్దేరారు. కానీ దారి తప్పారు. ఘాట్ రోడ్డు నుంచి పక్కకు వెళ్లిపోయారు. అటవీ ప్రాంతం కావటంతో ఆ చీకట్లో ఎటు వెళ్తున్నామో తెలియక ఇబ్బందులు పడ్డారు. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చి, వారి సాయంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.
Read Entire Article