అడ్డా కూలీగా హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టిన ఓ వ్యక్తి రూ. 100 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. స్థానిక జనాలను నమ్మించి చిట్టీల వ్యాపారం చేసిన సదరు కేటుగాడు చివరకు దుకాణం బంద్ చేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమని నెత్తినోరూ కొట్టుకుంటున్నారు.