సోషల్ మీడియాలో జనసేన పార్టీపై, కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. కొంతమంది మూర్ఖులు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుష్ర్పచారాలను జనసేన శ్రేణులు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఏరోజూ పదవుల కోసం ఆలోచించలేదన్న నాదెండ్ల మనోహర్.. రాష్ట్ర ప్రజల బాగుకోసమే ఆయన ఆలోచిస్తారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ ఆలోచనలు, చంద్రబాబు విజన్ అవసరమని అభిప్రాయపడ్డారు.