తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక ప్రకటన చేశారు. అధికారుల తప్పిదాల కారణంగా కొన్ని ప్రైవేటు భూములు 22ఏ జాబితాలో చేరినట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి మొత్తం 757 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. న్యాయబద్ధమైన ప్రైవేటు భూములను త్వరలోనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు మంత్రి క్షమాపణలు చెప్పారు.