సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన సవాల్ విసిరారు. సిగాచి పేలుడు బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చినట్లు ముఖ్యమంత్రి నిరూపిస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. పరిశ్రమలో పేలుడు సంభవించి 54 మంది ప్రాణాలు కోల్పోతే.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు మండిపడ్డారు.