ఇటీవల కాలంలో గోదావరిలోకి పులసల రాక తగ్గిపోయింది. కొత్తనీరు వచ్చినప్పుడల్లా పులసల కోసం గోదావరి ప్రజలు ఎగబడేవారు. కానీ ఇప్పుడు ఒకటో రెండో పడుతున్నాయి తప్పా మిగతావి ఎక్కడా కనిపించడం లేదు. అయినా, కొందరు పులసలు అంటే ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందిన విలసలను తెచ్చి అమ్ముతున్నారని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. దూరం నుంచి వచ్చిన వారు వాటినే పులసలు అని నమ్మి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.